Sunday, February 15, 2009

An unseen paradise

ON THE KERALA KARNATAKA BORDER .....where once Veerappan dwelled....is open to tourism now......... TAJ hotel is the first to reach this UNSEEN PARADISE ...!


HOW TO ASK YOUR BOSS FOR A SALARY INCREASE..?

One day an employee sends a letter to his boss asking for an increase in his salary !!!

Dear Bo$$In thi$ life, we all need $ome thing mo$t de$perately. I think you $hould be under$tanding the need$of u$.We are worker$who have given $o much $upport including $weat and $ervice to your company ..I am $ure you will gue$$what I meant and re$pond $oon. Your$$incerely,

The next day, the employee received this letter of reply:

Dear I kNOw you have been working very hard. NOw a days, NOthing much has changed. You must haveNOticed that our company is NOt doing NOticably well . NOw the newspapers are saying the world's leading ecoNOmists are NOt sure if the United States may go into aNOther recession. After the NOvember presidential elections things may turn bad. I have NOthing more to add NOw. You kNOw what I mean .

---- Your Boss.----

స్త్రీలు జుట్టు విరబోసుకోరాదంటారు ఎందుకు?


జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు ముడివేసుకుని సువాసన గల పూలు ధరించడం పుని స్త్రీల ఆచారం. పువ్వులకు సుమనస్సులు అని పేరు. వాటి సువాసన వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. సహజంగా స్త్రీలలో ఏదేని విషయం పట్ల పట్టుదల పెరిగితే జుట్టు ముడి వేసుకోమని పట్టుపడతారు. ద్రౌపది, దుశ్శాసనుడు తన జుట్టుపట్టుకు గుంజాడన్న రోషంతో ద్రౌపది ఆనాడు జుట్టు విరబోసుకుంది. కనుక అట్టి కార్యాన్ని రోజువారి చేయకూడదంటోంది శాస్త్రం.గంగానది పుణ్య నదులలో స్నానం చేసే ముందు స్త్రీలు, పురుషులు తమ జుట్టు, గోళ్లు తీయించుకుని నీళ్లలో పడవేయడం, తండ్రి తాతలు మరణిస్తే జుట్టు తీయించుకోవడం మొదలైన ఆచారాల ఆంతర్యమిదేనంటారు.

అందం సరే... మరి వ్యక్తిత్వం మాటో...!!





ఈనాటి స్పీడ్ యుగంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందంగా ఉండటం అంటే.. తెల్లగా ఉండటమే అన్న భావం ఇప్పటి యువతలో బలంగా నాటుకుపోయింది. అందంగా, తెల్లగా కనిపించేందుకోసం వీరు పడే పాట్లు అంతా ఇంతా కాదు. "మీరు మా క్రీమును వాడితే రెండు రోజుల్లోనే తెల్లగా మారిపోతారంటూ" వచ్చే ప్రకటనలపై వీరు చాలా సులభంగా ఆకర్షితులవుతుంటారు.ఇలా ఏదిబడితే దాన్ని తీసుకుని, తమ శరీరాలపై ప్రయోగం చేసేసే వీరు.. తెల్లబడటం కథ అలా పక్కనుంచేస్తే... చాలా రకాల సైడ్ ఎఫెక్ట్‌ల బారిన పడుతుంటారు. "ఉన్నది పోయే..." అన్న చందంగా మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములను కొనేందుకు, తమ పాకెట్ మనీనంతా నీళ్లలాగా ఖర్చుచేసి మరీ డంగైపోయే ఈనాటి అమ్మాయిల కోసం... ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, వారి అందాన్ని పెంచుకునేందుకు... కాసిన్ని చిట్కాలు... అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. అయితే... ఆరోగ్యమైన చర్మానికి మార్కెట్‌లో దొరికే పలురకాల క్రీములకంటే, ఎక్కువగా మేలు చేసే గుణాలు మనం ప్రతిరోజూ వాడుతుండే పాలు, పండ్లు, వంటింటి పోపుల దినుసుల్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.


రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జులో పది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగి చూడండి. జిడ్డు మాయమై ముఖం ప్రెష్‌గా, ప్రకాశవంతంగా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.అలాగే... రెండు లేదా మూడు పెద్ద క్యారెట్లను ఉడికించి మెత్తగా చిదిమి, దానికి నాలుగు టీస్పూన్ల తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ఓ వెలుగు వెలిగిపోతారు సుమా...! ఇకపోతే ఈ మాస్క్... అన్ని రకాల చర్మ తత్వాలకూ పని చేస్తుంది.పచ్చిపాలలో దూదిని ముంచి చర్మాన్ని తుడిస్తే... కంటికి కనిపించనటువంటి మురికి వదిలిపోతుంది. పాలు చర్మ రంధ్రాలలోకి వెళ్లి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. స్వచ్ఛమైన ఆముదంతో చర్మాన్ని మర్దనా చేస్తే... మృదుత్వాన్ని సంతరించుకోవడమే గాకుండా, ముడుతలను నివారిస్తుంది. ముడుతలు మాయమైతే అట్టే వయసయిపోయినట్లు కనిపించరు కదా..!ఒక టీస్పూన్ కమలాపండు రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత తుడిచివేయాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేగాకుండా, చర్మానికి చక్కటి మెరుపునిచ్చి, కాంతివంతంగా చేస్తుంది.ఒక టీస్పూన్ మినప్పప్పు, ఐదారు బాదంపప్పులు కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బి ముఖానికి పట్టించి, అరగంట తరువాత కడిగేయాలి. ఈ ప్రొటీన్ మాస్క్ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో రెండు టీస్పూన్ల పాలమీగడ కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగితే అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీనిని ఏ రకం చర్మం కలవారైనా వాడవచ్చు.కాబట్టి... మోసపూరిత ప్రకటనల బారిన పడకుండా... ప్రకృతి సహజంగా, స్వచ్ఛంగా దొరికే పాలు పండ్లు, పోపుల సామానులతోనే మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. సైడ్ ఎఫెక్ట్‌ల బాధనుండి తప్పించుకోండి. అయితే.. చివర్లో నాదో మనవి... అందంగా కనిపించాలని మాత్రమే తాపత్రయపడకుండా, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు కూడా కృషి చేయగరని కోరుకుంటూ...

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి

నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. అయితే వాటికున్న పరస్పర వ్యతిరేక లక్షణాలే
పెళ్లికి అడ్డంగా నిలిచాయి. నిప్పు తాకితే నీరు ఆవిరై పోతుంది. నీరు నిప్పుపై పడితే చల్లారి పోతుంది. మరి పెళ్లి చేసుకోవడం ఎట్లా..? అని అవి దీర్ఘంగా ఆలోచించాయి.ఎంతకీ దారీ, తెన్నూ తెలియక పోవడంతో.. తమ తమ చుట్టాలను సంప్రదించాయి నీరూ, నిప్పూ. నీరేమో తన బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పక పోవడమే గాకుండా, "మనకు వాటికి జన్మ జన్మల వైరం ఎట్లా కుదురుతుందంటూ" కోప్పడ్డాయి.నిప్పేమో తన బంధువులైన పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పుమీద ఇంతెత్తున లేచాయి. నీరూ, నిప్పు ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు. పైగా, అదెలా సాధ్యం అని వీటినే ప్రశ్నించాయి, కోప్పడ్డాయి, కుదరదన్నాయి.అందరిలాగే పెళ్లి చేసుకుని, పిల్లా జెల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్న నీరూ, నిప్పూ ఆశ తీరే దారే కనిపించలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన అధీనంలోకి తీసుకున్న కార్మికుడి వద్దకెళ్లి... ఎలాగైనా సాయం చేయమని అడిగాయి.అతను ఆలోచించి.. సరేలే.. మీ ఇద్దరికీ పెళ్లి నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించి, ఇరువైపులా చుట్టాలను పిలిచాడు. పెళ్లి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదకరమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా రాద్ధాంతం చేశాయి.అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్న కార్మికుడు పెద్దలను ఒప్పించాడు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాడు. నీరూ, నిప్పును బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు. ఎవ్వరూ కాదన్నా కూడా తమకు సాయంగా నిలిచి పెళ్లి చేసిన కార్మికుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాయి నీరూ, నిప్పూ...ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోసాగారు. వీరికి ఆవిరి అనే కొడుకు పుట్టాడు. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు.. పిడుగు, అగ్ని పర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాణ్ణి చూసి అందరూ సంతోషపడ్డారు. వీడేమో చక్కగా రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.నీరూ, నిప్పూలకు పెళ్లి చేయటమే ప్రమాదమని వారించిన బంధుమిత్రులు.. ఇతర ప్రజానీకం అందరూ ఇప్పుడేమో ఆవిరిగాణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద సాహసం చేసి రెండింటినీ కలిపిన కార్మికుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

మన చేతుల్లో ..

మన చేతుల్లో ఏమీ లేదన్నది
మననం చేయవలసిన విషయం
పాటు పడడానికి పదివేళ్ళున్నాయన్నది
మరచిపోకూడని సత్యం